విశాఖపట్నం స్టీల్ప్లాంటు ప్రమాద ఘటనలో మరొకరు చనిపోయారు. ప్రమాద ఘటనలో గాయపడిన పెద్ద గంట్యాడలోని సీతానగరానికి చెందిన సూరిబాబు అనే కార్మికుడు.. శనివారం చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. స్థానిక సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో మృతుల సంఖ్య పదికి చేరింది. మరోవైపు ఈ ఘటనపై త్రిసభ్య కమిటీ దర్యాప్తు జరుపుతోంది. ఇక వరుస ప్రమాదాల నేపథ్యంలో 22 మంది అధికారులను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు.