విశాఖపట్నం స్టీల్ప్లాంట్లో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ద్రవ ఉక్కు లీక్ కావటంతో ఎస్ఎంఎస్ -2, ఎస్టీసీ -3 హీట్ ఎఫ్జీలో ప్రమాదం జరిగింది. ప్రమాదం కారణంగా సీసీడీ విభాగంలో మంటలు ఎగసిపడుతున్నాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది కార్మికులు చనిపోయినట్లు సమాచారం. గాయపడిన వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.