Visakhapatnam IBM Registered With STPI: ఐటీ దిగ్గజ కంపెనీ ఐబీఎం మళ్లీ విశాఖపట్నంలో అడుగు పెట్టబోతోంది. ఐబీఎం విశాఖపట్నం సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ)లో రిజిస్టర్ చేసుకుంది. ‘ఐబీఎం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో నమోదు చేసుకున్నట్లు ఎస్టీపీఐ ట్వీట్ చేసింది. వచ్చే మూడేళ్లలో రూ. 322 కోట్ల విలువైన ఐటీ ఉత్పత్తులు ఎగుమతి చేస్తామని తెలిపింది. ఐబీఎం రాకతో 502 మందికి ఉద్యోగాలు వస్తాయని పేర్కొంది.