విశాఖపట్నంలో ఓ కోడలు తన అత్తను అత్యంత కిరాతకంగా సజీవ దహనం చేసిన ఘటనతో రెండు తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. అత్త.. తన మీద భర్తకు చాడీలు చెబుతోందని కక్ష పెంచుకున్న ఆమె, యూట్యూబ్లో వీడియోలు చూసి అత్త హత్యకు పక్కా ప్లాన్ చేసింది. దొంగాపోలీసు ఆట పేరుతో అత్తను కట్టేసి, పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలు..