Andhra Pradesh New Flight Services: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్రం శుభవార్త తెలిపింది. రాష్ట్రం నుండి అబుదాబి, బెంగళూరు, భువనేశ్వర్లకు కొత్త విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. విశాఖపట్నం-అబుదాబి విమాన సర్వీసులు జూన్ 13 నుండి, విశాఖపట్నం-భువనేశ్వర్ విమాన సర్వీసు జూన్ 12 నుండి ప్రారంభమవుతాయి. విజయవాడ-బెంగళూరు మధ్య ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానాలు జూన్ 2 నుండి అందుబాటులో ఉంటాయి. విజయవాడ నుండి విశాఖపట్నంకు జూన్ 1 నుండి ఇండిగో సంస్థ నూతన విమాన సర్వీసును ప్రారంభించనుంది.