Pakistani Nationals Await To Stay In Visakhapatnam: జమ్మూకాశ్మీర్లోని ఉగ్రదాడితో భారత్-పాక్ సంబంధాలు దెబ్బతిన్నాయి. దీంతో పాకిస్థాన్ పౌరులను భారత్ విడిచి వెళ్లాలని ఆదేశించారు. వైద్యం కోసం వచ్చిన వారు ఇబ్బందులు పడుతున్నారు. విశాఖలో కుమారుడి ట్రీట్మెంట్ కోసం వచ్చిన ఓ కుటుంబం తమ గోడును పోలీసులకు వెళ్లబోసుకుంది. ఇదిలా ఉండగా, శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ పాకిస్థాన్ అమ్మాయి ఉండటం చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ అమ్మాయి ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చింది? అనే ప్రశ్నలు అందరిలోనూ మెదులుతున్నాయి.