Chandrababu On Visakhapatnam Vijayawada Metro Rail Projects: ఏపీలో కీలకమైన విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు చేయూతనివ్వాలని కేంద్ర మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, పట్టణీకరణ సవాళ్లను పరిష్కరించడంలో ప్రాజెక్టుల ప్రాముఖ్యతపై వినతిపత్రం అందించారు. ఢిల్లీలోని ఖట్టర్ నివాసంలో చంద్రబాబు కేంద్ర మంత్రిని కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై చర్చించారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ చేశారు.