ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ టెక్నాలజీస్ సంస్థకు విశాఖపట్నంలోని వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది. ఓ కస్టమర్ ఫిర్యాదుపై విచారణ జరిపిన వినియోగదారుల కమిషన్ సర్వీసులో లోపంతో పాటుగా కస్టమర్ మానసిక వేదనకు గురయ్యేలా చేశారంటూ ఓలా సంస్థకు రూ.20 వేలు జరిమానా విధించింది. అతని ఎలక్ట్రిక్ స్కూటర్లోని లోపాలను ఉచితంగా సరిచేయాలని ఆదేశించింది.చట్టపరమైన ఖర్చుల కింద మరో పదివేలు ఇవ్వాలని ఆదేశించింది.