Kailasagiri 55 Feet Trishul: విశాఖపట్నం పర్యాటక అభివృద్ధిలో భాగంగా కైలాసగిరిపై 1.50 కోట్ల రూపాయలతో భారీ త్రిశూలం, ఢమరుకం నిర్మాణం చేపట్టనున్నారు. మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి, హోంమంత్రి వంగలపూడి అనితలు భూమిపూజ చేశారు. అంతేకాకుండా, బీచ్ రోడ్డులో 3.5 కోట్ల రూపాయలతో యూహెచ్-3 హెచ్ హెలికాప్టర్ మ్యూజియాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. విశాఖను పర్యాటక నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి స్వామి.