Vaarush Company Fraud In Visakhapatnam: విశాఖపట్నంలో ఐటీ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన ఘటన కలకలం రేపుతోంది. వారుష్ ఐటీ కంపెనీ సీఈవో వంకాయల సాయికుమార్ లక్షల్లో దోచుకుని, ఆరు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా, గతంలోనూ ఇలాంటి మోసాలు జరిగినట్లు తెలుస్తోంది. ఐటీ హబ్గా ఎదుగుతున్న నగరంలో బోగస్ కంపెనీల వ్యవహారం ఆందోళన కలిగిస్తోంది. బాధితులు మంత్రి లోకేష్ను కలుస్తామంటున్నారు.