Visakhapatnam Sleeping Pods In Railway Station: విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యార్థం సరికొత్త క్యాప్సూల్ హోటల్స్ ప్రారంభమయ్యాయి. తూర్పు కోస్తా రైల్వే జోన్లోనే మొదటిసారిగా అందుబాటులోకి వచ్చిన ఈ స్లీపింగ్ పాడ్స్లో సింగిల్, డబుల్ బెడ్ ఆప్షన్లు ఉన్నాయి. మహిళలకు ప్రత్యేకంగా బెడ్స్ కేటాయించబడ్డాయి. తక్కువ ధరలో AC, వైఫై, వేడి నీరు వంటి సౌకర్యాలతో పాటు టీవీ చూసేందుకు సోఫాలు కూడా ఏర్పాటు చేశారు. ఇది ప్రయాణికులకు ఎంతో అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు.