Visakhapatnam KGH NTPC Rs 2 Crore Donation: విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆస్పత్రి(KGH)కి భారీ విరాళం అందింది. మౌలిక సదుపాయాల కల్పనకు సింహాద్రి ఎన్టీపీసీ సామాజిక బాధ్యతలో భాగంగా ఈ డబ్బులు మంజూరు చేసింది. ఈ నిధుల వినియోగంపై సంస్థ అధికారులు, విశాఖ జిల్లా కలెక్టర్ మధ్య ఎంవోయూ కుదిరింది. నెఫ్రాలజీ విభాగంలో ఆరు డయాలసిస్ యూనిట్లు, భావనగర్ వార్డులో నాలుగు యూనిట్లు, ఆపరేషన్ థియేటర్లో ఆధునిక పరికరాల కొనుగోలు, ఇతర సదుపాయాల కల్పనకు ఈ నిధుల్ని వెచ్చించనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టరు, సంస్థ అధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.