Visakhapatnam Vmrda Bumper Offer On Plots: విశాఖపట్నం మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (VMRDA) బంపరాఫర్తో ముందుకొచ్చింది. అదానీ డేటా సెంటర్కు సమీపంలోని కాపులుప్పాడలో 21.52 ఎకరాల్లో 105 ప్లాట్లను వేలం ద్వారా విక్రయించనుంది. గజం ధర రూ.23,500గా నిర్ణయించారు. అయితే, మొదటి 20 మంది దరఖాస్తుదారులకు వేలం లేకుండానే ఈ ధరకే ప్లాట్లు కేటాయిస్తారు. ఐటీ నిపుణులకు ఇది మంచి పెట్టుబడి అవకాశం. ఆసక్తిగల విశాఖవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని VMRDA కోరింది.