Visakhapatnam Testbed: దేశంలో వాతావరణ అంచనాలు మరింత కచ్చితంగా ఉండేందుకు కేంద్రం 'మిషన్ మౌసం' ద్వారా టెస్ట్బెడ్లను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా విశాఖపట్నంలో తీర ప్రాంత అధ్యయనం కోసం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. అత్యాధునిక పరికరాల ద్వారా సేకరించిన సమాచారాన్ని విద్యార్థులు, పరిశోధకులు వాతావరణ పరిశోధనలకు ఉపయోగించనున్నారు. తుఫానులను ముందుగా గుర్తించేందుకు మొబైల్ రాడార్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా విపత్తుల వల్ల జరిగే నష్టాన్ని తగ్గించవచ్చు.