Nara Lokesh Jay Shah Visakhapatnam Food: విశాఖపట్నం ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఢిల్లీ కేపిటల్స్-సన్రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ మ్యాచ్ జరిగింది. అయితే అంతకముందు ఆంధ్ర క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో విశాఖలోని స్టేడియంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఐసీసీ ఛైర్మన్ జైషా, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్బిన్నీ, మంత్రి లోకేశ్లు హాజరయ్యారు. ఐపీఎల్ మ్యాచ్ ముగిసిన తర్వాత లోకేష్, జైషా, బిన్నీలు, విశాఖపట్నం స్ట్రీట్ ఫుడ్ కోసం ఫుడ్కోర్ట్కి వెళ్లారు. అక్కడి సిబ్బందితో సరదాగా ఒక ఫోటో దిగారు.