విశాఖపట్నంలో గూగుల్ సంస్థ ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటుకు సిద్ధమైంది. దీనిపై ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అయితే, డేటా సెంటర్ ఏరర్పాటు బాలారిష్టాలు ఎదుర్కొవడంపై సీఎం చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు. భూసేకరణను వ్యతిరేకిస్తూ రైతుల పేర్లతో తప్పుడు కేసులు వేయడం, చనిపోయిన వ్యక్తి పేరు కూడా ఉండటంపై ఆయన మండిపడ్డారు. అడ్డంకులు సృష్టిస్తున్న వారిపై కఠిన చర్యలకు ఆదేశించారు. రైతుల డిమాండ్లకు సానుకూలంగా స్పందించిన సీఎం, భూసేకరణను వేగవంతం చేయాలని సూచించారు.