Visakhapatnam Tcs Cognizant To Start Office: విశాఖపట్నంలో ఐటీ రంగం దూసుకుపోతోంది. టీసీఎస్ కార్యకలాపాలు త్వరలో ప్రారంభం కానుండగా, కాగ్నిజెంట్ సంస్థ వచ్చే ఏడాది జనవరి నుంచి తాత్కాలికంగా కార్యకలాపాలు మొదలుపెట్టనుంది. శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తూ, 800 మంది ఉద్యోగులతో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేయనుంది. గూగుల్ కూడా త్వరలోనే విశాఖలో అడుగుపెట్టనుంది. త్వరలోనే టీసీఎస్, కాగ్నిజెంట్ కార్యకలాపాలు ప్రారంభించడంపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు.