Visakhapatnam Fake Ayodhya Temple: విశాఖపట్నం బీచ్ రోడ్డులో అయోధ్య రామాలయం సెట్ వేసి దర్శనాలు, కళ్యాణాల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. భద్రాచలం దేవస్థానం పేరుతో కళ్యాణోత్సవం టికెట్లు అమ్మడంపై ఫిర్యాదు రావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. టికెట్ ధరలు, ట్రాఫిక్ సమస్యలు, భక్తుల రద్దీతో ఈ సెట్ వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.