విశాఖ జిల్లా వడ్లమూడి వద్ద నిర్మిస్తన్న ఆర్వోబీ ఆదివారం ప్రమాదవశాత్తూ కూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో మొత్తం పదిమంది కార్మికులు అక్కడ పనిచేస్తున్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ వంతెనను గత ఆరేళ్లుగా నిర్మిస్తున్నట్లు తెలిసింది.