కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ చట్టం సవరణ బిల్లు వీగిపోయింది. దీనిపై ఏపీసీసీ చీఫ్ షర్మిల స్పందించారు. వీగిపోయింది డీలిమిటేషన్ బిల్లే కానీ.. మహిళా బిల్లు కాదని.. మహిళా బిల్లుకు 2023లోనే ఆమోదం తెలిపినట్లు షర్మిల తెలిపారు. మహిళా రిజర్వేషన్ పేరుతో బీజేపీ చేసిన కుతంత్రాలు ఫలించలేదని.. ఇది దేశ ప్రజల విజయంగా వైఎస్ షర్మిల అభివర్ణించారు.