మొంథా తుపాన్ ధాటికి తెలంగాణ అతలాకుతలమైంది. ఎడతెరిపి లేని భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లాయి. రహదారులు ఏరులను తలపించాయి, ఇళ్లు కూలిపోయాయి, జనజీవనం స్తంభించింది. నేడు కూడా భారీ వర్షాలు కురవనుండగా.. ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. 16 జిల్లాలకు వరద ముప్పు పొంచి ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి.