తెలంగాణలో సంచలనం సృష్టించిన భూపాలపల్లి పట్టణానికి చెందిన నాగవెల్లి రాజలింగమూర్తి హత్య కేసుమిస్టరీని పోలీసులు ఛేదించారు. భూ తగాదాలే హత్యకు కారణంగా జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో మెుత్తం 10 మంది నిందితులు ఉండగా.. ఏడుగుర్ని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు.