ఒంగోలులో టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య రాష్ట్రంలో కలకలం రేపింది. ఆయన శరీరంపై 53 కత్తిపోట్లు ఉండటం సంచలనంగా మారింది. ఒక్కో కత్తిపోటుకు రెండు లక్షల రూపాయల ఒప్పందం జరిగిందనే అనుమానాలు ఉన్నాయి. ఈ హత్యకు మూడు నెలల ముందు నుంచే పథకం రచించారని పోలీసులు భావిస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు హత్యలో కీలకంగా ఉన్నారని అనుమానపడుతున్న వ్యక్తి కోసం హైదరాబాద్, విశాఖలో పోలీసులు గాలిస్తున్నారు.