వీళ్లను అసలు ఆటగాళ్లు అంటారా...? క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధావన్‌పై సజ్జనార్ ఆగ్రహం..

7 months ago 11
మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్‌ ల రూ. 11.14 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్ 1xBet ప్రచారం ద్వారా వీరు చట్టవిరుద్ధంగా లావాదేవీలు నిర్వహించినట్లు ఈడీ తెలిపింది. ఈ విషయంపై సీపీ సజ్జనార్ ఎక్స్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "బెట్టింగ్‌కు ప్రచారం చేసి, యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు. అభిమానాన్ని సొమ్ము చేసుకునే మీరు ఆదర్శ ఆటగాళ్లు ఎలా అవుతారు?" అని ఆయన ప్రశ్నించారు. బెట్టింగ్ కారణంగా జరుగుతున్న ఆత్మహత్యలకు మీరు బాధ్యులు కారా అని నిలదీశారు.
Read Entire Article