వృద్ధులు, దివ్యాంగులకు చేయూత పింఛన్ల పంపిణీలో అధికారులు కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టారు. వేలిముద్రల సమస్యలను అధిగమించేందుకు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ముఖ గుర్తింపు (Face Recognition) ప్రక్రియను అమలు చేస్తున్నారు. ఈ కొత్త విధానం పింఛన్ల పంపిణీని సులభతరం చేసి, లబ్ధిదారులకు ఉపశమనం కలిగిస్తుంది.