ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత కె. వెంకట్రామిరెడ్డి డిస్మిస్ వ్యవహారం ఏపీలో రాజకీయంగా చర్చనీయాంశమైంది. ప్రభుత్వ నిర్ణయంపై మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. ఏం తప్పు చేశారని డిస్మిస్ చేశారని నిలదీశారు. అశోక్ బాబుకు ఓ రూల్.. వెంకట్రామిరెడ్డికి మరో రూల్ ఉంటుందా అంటూ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో వెంకట్రామిరెడ్డి డిస్మిస్ అంశంపై మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అశోక్ బాబు స్పందించారు.