ఎంఆర్పీఎస్ నాయకుడిగా మంద కృష్ణ మాదిగ తన సామాజికవర్గానికి న్యాయపరంగా రావాల్సిన రిజర్వేషన్ల గురించి సుదీర్ఘ పోరాటం చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేసిన ఆయనకు.. రాజకీయాలకు అతీతంగా అందరు నాయకులతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇటీవల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి మనవడి రిసెప్షన్ వేడుకలోనూ ఆయన పాల్గొన్నారు. అయితే భోజనాల సమయంలో మంద కృష్ణ మాదిగకు అవమానం జరిగిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.