వెనక్కి తగ్గిన వైఎస్ జగన్.. నవంబర్ 21లోపు సీబీఐ కోర్టు ముందుకు..!

9 months ago 24
వైసీపీ అధినేత వైఎస్ జగన్ సీబీఐ కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యక్తిగత మినహాయింపు కోరుతూ జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాంపల్లి సీబీఐ కోర్టు వైఎస్ జగన్ పిటిషన్ విచారించి.. కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐను ఆదేశించింది. అయితే జగన్ అభ్యర్థనపై సీబీఐ అభ్యంతరం తెలపటంతో వైఎస్ జగన్ కోర్టు ఎదుట హాజరు కానున్నట్లు సమాచారం. ఆయన తరుఫు న్యాయవాదులు వారం రోజులు సమయం కోరగా.. నవంబర్ 21వ తేదీ వరకూ సీబీఐ కోర్టు సమయం ఇచ్చింది.
Read Entire Article