మంచిర్యాల జిల్లా బాదంపల్లిలో వేటగాళ్లు అమర్చిన మందుగుండు పదార్థాలు తిని మూడు గేదెలు తీవ్రంగా గాయపడ్డాయి. గోదావరి తీరంలో మేత మేస్తున్న సమయంలో అడవి పందుల కోసం వేసిన నాటు బాంబులను నమలడంతో అవి నోట్లోనే పేలాయి. ఈ ఘటనలో పశువుల దవడలు పూర్తిగా ఛిద్రమై ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాయి. పోలీసులు ఘటనా స్థలం నుంచి మరో 15 పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుని.. వేటగాళ్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.