విధి ఒక్కసారిగా విరుచుకుపడినా మానవత్వం ఓడిపోలేదు. హైదరాబాద్ ఉప్పల్కు చెందిన రైల్వే ఉద్యోగి శ్రీనివాస్ మర్రి విధి నిర్వహణలో ప్రమాదానికి గురై బ్రెయిన్ డెడ్ కావడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అయినా ఆ దుఃఖంలోనూ ఆయన సతీమణి రత్నకుమారి తీసుకున్న నిర్ణయం సమాజానికి ఆదర్శంగా నిలిచింది. భర్త కిడ్నీలు, లివర్, గుండె, ఊపిరితిత్తులను దానం చేసి ఐదుగురికి కొత్త జీవితం ఇచ్చారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి నుంచి నిమ్స్కు గ్రీన్ ఛానల్ ద్వారా గుండెను కేవలం తొమ్మిది నిమిషాల్లో తరలించి మరో ప్రాణాన్ని కాపాడారు. భర్త మరణంలోనూ అమరత్వాన్ని చూసిన ఆ ఇల్లాలి త్యాగం మానవత్వానికి నిలువెత్తు సాక్ష్యం.