వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ రూ.25 లక్షల జరిమానా చెల్లించారు. జర్మన్ పౌరసత్వం కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు ఈ చెల్లింపు జరిగింది. చెన్నమనేని తప్పుడు పత్రాలతో ఎన్నికల్లో పోటీ చేశారని ఆరోపిస్తూ ఆది శ్రీనివాస్ కోర్టును ఆశ్రయించారు. ఈ తీర్పుపై స్పందించిన ఆది శ్రీనివాస్, చెన్నమనేని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.