రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో అభివృద్ధి పనుల కారణంగా భక్తుల దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. యాదాద్రి తరహాలో ఆలయ విస్తరణ, పునరుద్ధరణ పనులు రూ. 76 కోట్లతో వేగవంతం చేశారు. భక్తులకు స్వామివారి దర్శనాన్ని ప్రచార రథం, ఎల్ఈడీ తెర ద్వారా కల్పిస్తున్నారు.