వ్యర్థ జలాల పునర్వినియోగం కోసం హైదరాబాద్ జలమండలి వినూత్న కార్యక్రమానికి రెడీ అయింది. గేటెడ్ కమ్యూనిటీల నుంచి శుద్ధి చేసిన మురుగునీటిని ఒక్కో ట్యాంకర్కు రూ.50-రూ.100 చెల్లించి సేకరించనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా 'ఎరుపు రంగు' ట్యాంకర్లను కేటాయించింది. సేకరించిన నీటిని నిర్మాణాలు, పరిశ్రమలు, పార్కుల నిర్వహణకు వాడడం ద్వారా తాగునీటిపై ఒత్తిడిని తగ్గించాలని జలమండలి అధికారులు భావిస్తున్నారు.