Ys Raja Reddy Sister Passed Away: వైఎస్ కుటుంబంలో విషాదం.. వైఎస్సార్ మేనత్త కమలమ్మ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె అమెరికాలో తుదిశ్వాస విడిచారు. కమలమ్మ పార్థీవ దేహాన్ని అమెరికా నుంచి పులివెందులకు తీసుకురానున్నారు. వైఎస్సార్ సమాధుల తోటలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కమలమ్మ మరణంపై వైఎస్ జగన్ సంతాపాన్ని తెలియజేశారు. నెలన్నర క్రితం వైఎస్ కుటుంబంలో విషాదం జరిగింది.. వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరుడు ఆనంద్ రెడ్డి కన్నుమూశారు.