Anitha Comments On YS Jagan Rs 1 Crore: విజయవాడలో గతేడాది వచ్చిన వరదతో నష్టపోయిన బాధితులకు వైఎస్సార్సీపీ అధినేత జగన్ రూ.1 కోటి విరాళం ప్రకటించిన అంశంపై ఏపీ శాసనమండలిలో చర్చకు వచ్చింది. వరద బాధితులకు జగన్ రూ.1 కోటి ఇచ్చారని విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. అందుకు మంత్రి పార్థసారథి స్పందిస్తూ... ప్రభుత్వానికి జగన్ విరాళం ఇవ్వలేదన్నారు.కూటమి ప్రభుత్వంపై తమకు నమ్మకం లేక.. తామే జగన్ ప్రకటించిన కోటి రూపాయాల విరాళాన్ని వరద బాధితులకు అందజేశామన్నారు. అందుకు తానే బాధ్యత తీసుకున్నట్లు చెప్పారు బొత్స. ఈ వ్యాఖ్యలకు హోంమంత్రి అనిత కౌంటరిచ్చారు.