Ed Attaches Dalmia Cement Rs 793 Crore Property: మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆస్తుల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈడీ కీలక నిర్ణయం తీసుకుంది.. దాల్మియా సిమెంట్స్ కు చెందిన రూ.793 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. సున్నపురాయి గనుల కేటాయింపులో అక్రమాలు జరిగాయని, ప్రతిగా జగన్ కంపెనీలో దాల్మియా పెట్టుబడులు పెట్టిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో నిధుల మళ్లింపు జరిగిందని ఈడీ అనుమానిస్తోంది. దీనికి ప్రతిగా భారీగా ముడుపులు చేతులు మారాయని తెలుస్తోంది. ఈడీ చర్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.