వైఎస్ జగన్ ఇలాఖాలో ఉప ఎన్నికలు.. ఆగస్ట్ 12న పోలింగ్.!

10 months ago 21
ఏపీలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్రమంలోనే వైఎస్సార్ కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. జూలై 30 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఆగస్ట్ ఒకటో తేదీ వరకూ గడువు ఉంది. ఆగస్ట్ 12న పోలింగ్, ఆగస్ట్ 14న కౌంటింగ్ ఉంటుంది. వైఎస్ జగన్ సొంత జిల్లాలో ఉప ఎన్నికలు కావటంతో రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రెండు జెడ్పీటీసీ, 3 ఎంపీటీసీ, 2 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
Read Entire Article