AP High Court Hearing On Ys Jagan Quash Petition: మాజీ ముఖ్యమంత్రి జగన్కు హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. సింగయ్య మృతి కేసులో జగన్ వేసిన పిటిషన్పై విచారణ జూలై 1కి వాయిదా పడింది. అప్పటివరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది. మరోవైపు, సింగయ్య మృతికి కారణమైన జగన్ కారును అధికారులు పరిశీలించారు. ఇంతకీ ఈ కేసులో జగన్కు నిజంగానే ఊరట లభిస్తుందా? అసలు ఏం జరిగిందనేది వేచి చూడాల్సిందే.