YS Jagan Invited For Amaravati Relaunch: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఈ వేడుకకు వైఎస్ జగన్ను కూడా ఆహ్వానించారు. గతంలో చంద్రబాబు ఆహ్వానించినా జగన్ రాలేదు. మరి ఇప్పుడు జగన్ వస్తారా? మూడు రాజధానుల ప్రకటన చేసిన జగన్ ఈ కార్యక్రమానికి హాజరవుతారా లేదా అనేది వేచి చూడాలి. రాజకీయ వర్గాల్లో దీనిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.