AP High Court Ys Jagan Z Plus Security: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనకు జెడ్ ప్లస్ భద్రత కల్పించాలని హైకోర్టును ఆశ్రయించారు. సీఆర్పీఎఫ్ లేదా ఎన్ఎస్జీ భద్రత కల్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం భద్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన తరపు న్యాయవాది వాదించారు. కేంద్రం వివరణ కోరగా, కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారం సమ్మర్ సెలవుల తర్వాత మళ్ళీ విచారణకు రానుంది. ఇంతకీ హైకోర్టు ఏం తేల్చనుంది?