వైసీపీ అధినేత వైఎస్ జగన్కు మరో షాక్ తగిలింది. సింగయ్య మృతి కేసులో పోలీసులు వైఎస్ జగన్ వాహనాన్ని సీజ్ చేసినట్లు తెలిసింది. వైఎస్ జగన్కు నోటీసులు ఇచ్చేందుకు వైసీపీ కేంద్ర కార్యాలయానికి నల్లపాడు పోలీసులు వెళ్లారు. వైసీపీ కార్యాలయ కార్యదర్శి అప్పిరెడ్డికి నోటీసులు అందించారు. అలాగే ప్రమాదానికి కారణమైన వైెఎస్ జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారును పోలీసులు తమతో పాటుగా తీసుకెళ్లారు.