Ys Sharmila Satires On Jagan: విజయవాడ జైల్లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించడంపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించాల్సిన వైసీపీకి అసెంబ్లీకి వెళ్ళే దమ్ము లేదన్నారు. కానీ నేరస్థులను, దౌర్జన్యం చేసిన వాళ్ళను జైలుకెళ్లి పరామర్శించే సమయం మాత్రం వైఎస్ జగన్కు ఉందంటూ సెటైర్లు పేల్చారు. మొహం చెల్లడం లేదు.. అసెంబ్లీకి వెళ్లే దమ్ము లేదన్నారు.