Anchor Syamala As Ysrcp Spokesperson: వైఎస్సార్సీపీ బాస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో మార్పులు, చేర్పులు మొదలు పెట్టారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీలో ప్రక్షాళన చేపట్టారు.. ఈ మేరకు వరుసగా పార్టీలో పలువురికి కీలక బాధ్యతలు అప్పగించారు. యాంకర్ శ్యామలకు వైఎస్ జగన్ ప్రమోషన్ ఇచ్చారు.. ఆమెకు కీలక బాధ్యతలు ఇచ్చారు. మాజీ మంత్రి రోజాకు కూడా పార్టీలో పదవి దక్కింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.