Parvathipuram Ysrcp Councillors In TDP: పార్వతీపురం మన్యం జిల్లాలో వైఎస్సార్సీపీ అధినేత జగన్ పర్యటించారు. జగన్ జిల్లాకు వచ్చిన రోజే వైఎస్సార్సీపీకి ఎదురు దెబ్బ తగిలింది. జగన్ పాలకొండ పర్యటనలో ఉండగా.. పార్వతీపురంలో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. స్థానిక మున్సిపాలిటీలో 23, 24, 19 వార్డులకు చెందిన ముగ్గురు వైసీపీ కౌన్సిలర్లు ఎం.రవికుమార్, ఎం.ఉమామహేశ్వరి, బోదయ్య టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.