Jagan ibrahimpatnam visit: వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా ఇబ్రహీంపట్నంలో విషాదం చోటుచేసుకుంది. అస్వస్థతకు గురై రాంబాబు అనే వైసీపీ నాయకుడు చనిపోయారు. పల్స్ పడిపోవటంతో రాంబాబు కుప్పకూలగా.. చుట్టుపక్కలవారు ఆస్పత్రికి తరలించారు. అయితే.. అప్పటికే రాంబాబు చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అయితే జగన్ ఇబ్రహీంపట్నంలోకి రాకముందే.. రాంబాబు అస్వస్థతకు గురైనట్లు వైసీపీ వెల్లడించింది. రాంబాబు మరణాన్ని జగన్ పర్యటనకు లింక్ చేస్తూ దుష్ర్పచారం చేస్తున్నారని ఆరోపించింది.