వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి కేక్ కట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లు.. జగన్ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారన్నారు. ప్రపంచంలోని కోట్లాది మంది అభిమానుల గుండె చప్పుడు వైఎస్ జగన్ అన్నారు. గెలుపు ఓటములకు అతీతంగా ప్రజాసంక్షేమమే ఆయన లక్ష్యమని.. ఐదేళ్ళ పాలనలో ప్రజల జీవితాల్లో సమూల మార్పులకు నాంది పలికారన్నారు. రాజకీయాల్లో వైయస్ జగన్ ప్రస్థానం ఒక చరిత్రని.. ఇచ్చిన మాటకు కట్టుబడే ఆయన ఎందరికో ఆదర్శప్రాయం అన్నారు.