IB Report On Ys Jagan Security: మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జెడ్ ప్లస్ భద్రత కల్పించాలనే పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదికను కోర్టుకు సమర్పించింది. జగన్ ప్రస్తుతం ఎలాంటి భద్రతాపరమైన ముప్పు లేదని ఐబీ తెలిపింది. అయితే, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయడానికి కేంద్రం సమయం కోరింది. తదుపరి విచారణను జూలై 15కు వాయిదా వేసింది.