YSRCP Ex MLA Ravindranath Reddy Political Comments in Tirumala: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిపై టీటీడీ చర్యలకు సిద్దమవుతోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం బయట మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ రెడ్డి రాజకీయ వ్యాఖ్యలు చేశారని టీటీడీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలను టీటీడీ విజిలెన్స్ విభాగం పరిశీలిస్తోంది.