వైఎస్ భారతిని తిట్టినందుకు టీడీపీ మాజీ కార్యకర్త చేబ్రోలు కిరణ్పై కేసు నమోదు కాగా.. పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే చేబ్రోలు కిరణ్పై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలోనే మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్.. చేబ్రోలు కిరణ్పై దాడి చేశారంటూ ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వైఎస్ భారతిని తిట్టినందుకు కిరణ్పై గోరంట్ల దాడి చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు.. గోరంట్లను పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం.