Chebrolu Kiran: మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ కుమార్పై టీడీపీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించేది లేదంటూ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆదేశించడంతో.. టీడీపీ నేతలు ఫిర్యాదు మేరకు గుంటూరు పోలీసులు చేబ్రోలు కిరణ్పై కేసు నమోదు చేశారు. మరోవైపు కిరణ్ వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ సీరియస్గా స్పందించింది.. కిరణ్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.